Posts

tdp leader killed in road accident in hyderabad shaad nagar

Image
కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో టీడీపీ నాయకుడు, షాద్‌నగర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ బాలమోని కృష్ణయాదవ్‌(45) మృతిచెందారు. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న షాద్‌నగర్‌ సింగిల్‌ విండో సీఈవో బ్రహ్మం, బైకని సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివారులో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా సహకార బ్యాంకులో పనుల నిమిత్తం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీరు కారులో బయల్దేరారు. మార్కెట్‌యార్డు సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణయాదవ్‌ మృతి చెంతిదారు.